- Advertisement -
అమరావతి: కరోనా సోకిన వ్యక్తిని రహస్యంగా ఓ బంధువు కలవడంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ వ్యక్తి తన కుమారుడిని సూర్యాపేట జిల్లా మిట్టపల్లిలోని తన అత్తగారింటికి పంపించాడు. మామకు గుండె నొప్పి రావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతడికి కరోనా టెస్టు చేయగా పాజిటివ్ వచ్చింది. ఆయన అల్లుడు లాక్డౌన్ నిబంధనలు ఉల్లఘించి చీరాల నుంచి గుంటూరుకు వెళ్లి మామను పరామర్శించారు. అనంతరం తన కుమారుడిని తన సొంతూరుకు తీసుకొచ్చారు. మామకు కరోనా విషయం దాచిపెట్టి సొంతూరుకు వచ్చిన అల్లుడుపై పోలీసులు కేసు నమోదు చేసి క్వారంటైన్కు తరలించారు.
Case registered on Son in law in Coronavirus in Hyd
- Advertisement -