- Advertisement -
హైదరాబాద్: 2020 విద్యుత్ సవరణ యాక్ట్ తీసుకురావాలని కేంద్రం భావిస్తోందని తెలంగాణ విద్యుత్ ఇంజినీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శివాజీ తెలిపారు. ఈ బిల్లును అమలు చేసేందుకు తాము ఒప్పుకోమని సిఎం కెసిఆర్ చెప్పారన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి 24 గంటల కరెంటు అందిస్తోందన్నారు. కొత్త బిల్లు ఆమోదం పొందితే ఉచిత విద్యుత్ అందని ద్రాక్షనే అవుతోందని, ఎస్సి, ఎస్టిలకు ఇస్తున్న 100 ఉచిత యూనిట్స్ కూడా ఇక ఉండదన్నారు. రాష్ట్రాల అధికారులను కేంద్రం తీసుకోవడం దారుణమైన విషయమని మండిపడ్డారు.
- Advertisement -