- Advertisement -
హైదరాబాద్: తెలంగాణరాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లా నీరు సరఫరా చేస్తున్నారంటూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రశంసలు కురిపించారు. రాజ్యసభలో జల్మంత్రిత్వ శాఖ పనితీరుపై మంగళవారం చర్చజరిగింది. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికీ నల్లాల ద్వారా మంచినీటిని అందిస్తోందన్నారు. రాష్ట్రంలో అన్ని పాఠశాలలకు, అంగన్ వాడీ కేంద్రాలకు ఫ్లోరైడ్ రహిత శుద్దిచేసిన నీటిని అందిస్తున్నారంటూ అభినందనలు తెలిపారు. మంత్రి షెకావత్ చేసిన ప్రశంసలకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధన్యవాదాలు చెప్పారు. కేవలం ప్రశంసలతో సరిపెట్టకుండా నీతిఆయోగ్ రెకమెండ్ చేసిన విధంగా తెలంగాణ రాష్ట్రానికి నిధులు కూడా ఇస్తే బాగుంటుందని దయాకర్ రావు కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.
- Advertisement -