- Advertisement -
రావత్ వారసుని ఎంపిక ప్రక్రియ ప్రారంభం
న్యూఢిల్లీ : జనరల్ బిపిన్ రావత్ వారసునిగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవనె ఎంపికయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ పదవికి ముందు వరుసలో నరవనె ఉన్నారు. ఐదునెలల్లో చీఫ్ ఆఫ్ ఆర్మీస్టాఫ్గా రిటైర్ కానున్న నరవనెను సిడిఎస్ పదవికి ఎంపిక చేయడం సమంజసమని రిటైర్డ్ మిలిటరీ కమాండర్లు అనేక మంది ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఈ ఎంపిక కోసం ప్రభుత్వం గురువారం ప్యానెల్ కమిటీని ఏర్పాటు చేయనున్నదని ఈ ప్యానెల్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్కు చెందిన సీనియర్ కమాండర్లు ఉంటారని అనధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. కేంద్ర రక్షణమంత్రి అనుమతించిన తరువాత కేబినెట్ అపాయింట్స్ కమిటీ పరిశీలనకి పేర్లు వెళ్తాయి. ఆ తరువాత తుది నిర్ణయం జరుగుతుంది. తూర్పు లడఖ్ ప్రాంతంలో నెలకొన్న ప్రతిష్టంభనను నరవనే పరిష్కరించే సామర్ధం కలిగిన వారుగా పలువురు సూచిస్తున్నారు.
- Advertisement -