Monday, May 6, 2024

చరిత్ర సృష్టించిన ఇస్రో.. విజయవంతంగా చంద్రుడిపై దిగిన రోవర్ ప్రజ్ఞాన్

- Advertisement -
- Advertisement -

భారత అంతరిక్ష పరిశోదన సంస్థ(ఇస్రో) సరికొత్త చరిత్ర సృష్టించింది. చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్‌-3 విజయవంతంగా అడుగుపెట్టింది. సుమారు 40 రోజులపాటు ప్రయాణించిన ల్యాండర్ విక్రమ్ సక్సెస్ ఫుల్ గా రోవర్ ప్రజ్ఞాన్ ను చంద్రుడిపై దింపింది. సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లి ఉపరితలంపై రోవర్ ప్రజ్ఞాన్ ను ల్యాండర్ విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంతో… చంద్రయాన్‌-3 విజయవంతమైనట్లు ఇస్రో ప్రకటించింది. దీంతో చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండైన తొలి దేశంగా భారత్‌ రికార్డు సృష్టించింది. చంద్రుడిపై కాలుమోసిన నాలుగో దేశం భారత్‌ నిలించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News