Monday, May 6, 2024

మైనర్ బాలికపై ఎంఎల్ఎ అత్యాచారం…. పరార్

- Advertisement -
- Advertisement -

Rape

 

పాట్నా: ఆర్జెడి ఎంఎల్ఎ మైనర్ బాలికపై అత్యాచారం చేసినట్టుగా పోలీసులు కేసు నమోదు చేసి ఛార్జ్ షీటు కోర్టులో దాఖలు చేశారు. ప్రస్తుతం ఆ ఎంఎల్ఎ పరారీలో ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….  సాండర్స్ నియోజకవర్గానికి చెందిన ఆర్జెడి ఎంఎల్ఎ అరుణ్ యాదవ్ మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. దీంతో సదరు బాలికపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు సదరు ఎంఎల్ఎపై పోస్కో, లైంగిక వేధింపులు, అత్యాచారం కేసులు నమోదు చేశారు. కానీ అరుణ్ యాదవ్ పరారీలో ఉన్నారు. నిందితుడు లేకపోవడంతో  ఫిబ్రవరి 10కి తీర్పును కోర్టు వాయిదా వేసినట్టు సమాచారం. అరుణ్ యాదవ్ కు సంబంధించిన ఆస్తులను కోర్టుకు అటాచ్ చేసినట్టు జడ్జ్ ఆర్ కె సింగ్ తెలిపారు.   పేద కుటుంబాలకు చెందిన బాలికకు ఎదో ఒక ఆశ చూపి సెక్స్ రాకెట్ లోకి కొందరు దించుతున్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News