- Advertisement -
హైదరాబాద్: వేములవాడ ఎంఎల్ఎ చెన్నమనేని పౌరసత్వం కేసు అక్టోబర్ 21కి వాయిదా పడింది. చెన్నమనేని పౌరసత్వం కేసులో పలు కీలక విషయాలతో పాటు పలు అంశాలు చర్చించవలసి ఉన్నందున కేసును బౌతికంగానే వాదనలు వినాలని కోర్టును చెన్నమనేని న్యాయవాది వై. రామారావు కోరారు. రాష్ట్ర ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్ర ర్రావు, కేంద్ర ప్రభుత్వ అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్ రాజేశ్వర రావు కూడా భౌతికంగా వాదనలు వినిపించడానికి సమర్ధించారు. అనేక రకమైన అఫిడవిట్ లు, మెమోలు, కేస్ లాస్ ఉన్నందున వాదనలకు అన్ని పార్టీలు భౌతికంగా వాదనకు చేయడానికి సిద్ధంగా ఉండాలని హైకోర్టును కోరారు.
- Advertisement -