Saturday, April 27, 2024

పట్టణాలకు పట్టం

- Advertisement -
- Advertisement -

KCR

 

24 నుంచి 10 రోజులపాటు పట్టణ ప్రగతి
రాష్ట్రంలో చక్కని నగర జీవన వ్యవస్థ నెలకొనాలి
పట్టణ ప్రగతితో పునాది వేయాలి
పచ్చదనం, పారిశుద్ధం వెల్లివిరియాలి
ప్రణాళికబద్ధ ప్రగతి సాధించాలి
పౌరులకు మెరుగైన సేవలు అందించాలి
పట్టణప్రగతి ప్రజలందరి భాగస్వామ్యం ఉండాలి
రేపు ఉదయం ప్రగతిభవన్‌లో రాష్ట్రస్థాయి సదస్సు
చైర్‌పర్సన్లు, కమిషనర్లు, ఎంఎల్‌ఎలు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు హాజరుకావాలి
అదే రోజు మధ్యాహ్నం గజ్వేల్‌లోని వెజ్, నాన్‌వెజ్ మార్కెట్, సశ్మాన వాటిక సందర్శనకు తీసుకువెళ్లాలి
వార్డు యూనిట్‌గా పట్టణ ప్రగతి జరగాలి
వార్డుకు 4 ప్రజాసంఘాలను ఏర్పాటు చేయాలి
నెలనెలా జిహెచ్‌ఎంసికి రూ.78కోట్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రూ.70కోట్లు విడుదల
జనాభా ప్రాతిపదికన ఫిబ్రవరి, మార్చి
మాసాలకు నిధులు అందించాలి
14వ ఆర్థిక సంఘం ద్వారా రావాల్సిన రూ.811కోట్లలో రూ.311 జిహెచ్‌ఎంసికి, రూ. 500 కోట్లు ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు
హరితప్రణాళిక రూపొందించాలి
పారిశుద్ధ పనుల కోసం 3100 వాహనాలు
వేలం ద్వారా రాజీవ్‌స్వగృహ ఇళ్ల విక్రయం
ప్రగతిభవన్‌లో 7గంటల పాటు సుదీర్ఘ
కేబినెట్ భేటీలో సిఎం కెసిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : ఈ నెల 24 నుంచి పది రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో పట్టణ ప్రగతి కార్యక్ర మం నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ప్రగతి భవన్ లో ఆదివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం సుమారు ఆరుగంటల పాటు పట్టణ ప్రగతి నిర్వహణపై విస్తృత చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ రాష్ట్రం లో చక్కని నగర జీవన వ్యవస్థపై పయనం సాగడమే లక్ష్యంగా పట్టణ ప్రగతి కార్యక్రమంతో మంచి పునాది ఏర్పడాలన్నారు.

ఇందుకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేయడానికి ఈ నెల 18న ప్రగతి భవన్ లో రాష్ట్ర స్థాయి మున్సిపల్ సదస్సు నిర్వహించాలన్నారు. పట్టణాల్లో పచ్చదనం- పారిశుధ్యం వెల్లివిరియాలని, ప్రణాళికాబద్ధమైన ప్రగతి జరగాలని, పౌరులకు మెరుగైన సేవలు అందాలని, మొత్తంగా ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే దిశగా అడుగులు పడాలని సిఎం పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతి ద్వారా ప్రజలందరి విస్తృత భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని సిఎం కోరారు. ప్రస్తుతం పట్టణాలు ఎలా ఉన్నాయి? రాబోయే రోజుల్లో ఎలా ఉండాలి? అనేది ప్రణాళిక వేసుకుని అందుకు అనుగుణంగా నిధులు వినియోగించుకుని క్రమపద్ధతిలో ప్రగతి సాధించాలన్నారు.

కేబినెట్ నిర్ణయాలు
ఈ నెల 24 నుంచి అన్ని పట్టణాలు, నగరాల్లో పది రోజుల పాటు పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించాలి నిర్ణయం తీసుకున్నారు. అలాగే పట్టణ ప్రగతి కార్యక్రమం సన్నాహకం కోసం ఈ నెల 18న ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర స్థా యి సదస్సు నిర్వహించాలని సిఎం ఆదేశాలిచ్చారు. మేయర్లు, మున్సిపల్ చైర్ పర్సన్లు, కమిషనర్లు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు పట్టణ ప్రగతి కార్యక్రమ నిర్వహణపై చర్చించాలని, వార్డు యూనిట్ గా పట్టణ ప్రగతి జరగాలి. ప్రతీ వార్డుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా వార్డుల వారీగా చేయాల్సిన పనులను, మొత్తం పట్టణంలో చేయాల్సిన పనులను గుర్తించాలని, అలాగే పట్టణ ప్రగతిలో భాగంగా నిరక్షరాస్యులను గుర్తించాలని స్పష్టం చేశారు.

-ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్ లో వార్డుల వారీగా నాలుగు చొప్పున ప్రజా సంఘాలను ఏర్పాటు చేసే ప్రక్రియ వచ్చే ఐదు రోజుల్లో పూర్తి కావాలని, జిహెచ్‌ఎంసికి నెలకు రూ.78 కోట్ల చొప్పున, రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నెలకు రూ.70 కోట్ల చొప్పున వెంటనే ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈక్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి మాసాలకు సంబంధించిన నిధులు జనాభా ప్రాతిపదికన ఆయా పట్టణాలకు అందించాలని, ఈ విధంగా రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలకు నెలకు రూ.148 కోట్ల చొప్పున నిధులు సమకూరుతాయని సిఎం స్పష్టం చేశారు. పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టే పనులకు నిధుల కొరత ఉండదని, 14వ ఆర్థిక సంఘం ద్వారా రావాల్సిన రూ. 811 కోట్లకు గాను రూ. 500 కోట్లు రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు, రూ.311 కోట్లు జిహెచ్‌ఎంసికి కేటాయించాలన్నారు.- పట్టణ ప్రగతిలో పచ్చదనం – పారిశుధ్యం పనులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సిఎం ఆదేశించారు.

పట్టణాల్లో – ఎప్పటికప్పుడు డ్రైనేజీలు శుభ్రం చేయడంతో పాటు , మురికి గుంతలు గుర్తించి వెంటనే పూడ్చాలన్నారు. అదేవిధంగా విరివిగా మొక్కలు నాటాలని, హరిత ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. వార్డుల్లో నర్సరీల ఏర్పాటుకు అనువైన స్థలాలను ఎంపిక చేయడంతో పాటు నగరాలు,పట్టణాల్లో స్థలాలు అందుబాటులో లేకుంటే సమీప గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేసి అందుకోసం గ్రామాలను ఎంపిక చేయానున్నారు. – మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పారిశుధ్య పనుల కోసం మొత్తం 3100 వాహనాలు సమకూర్చాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిందని సిఎం వివరించారు.

వీటిలో 600 వాహనాలు వచ్చాయని, మిగతా 2500 వాహనాలను త్వరగా తెప్పించి, పట్టణాలకు పంపాలని ఆదేశించారు. ఇంకా ఎన్ని వాహనాలు అవసరమో అంచనా వేసి, వాటినీ సమకూర్చాలని అధికారులకు సూచించారు. – పట్టణాల్లో మంచినీటి సరఫరా వ్యవస్థను పటిష్టం చేయాలని, – పట్టణాల్లో ప్రధాన రహదారులు, అంతర్గత రహదారుల పరిస్థితిని మెరుగుపరచాలని సిఎం ఆదేశించారు. గుంతలు పూర్తిగా పూడ్చేయాలని, – దహన వాటికలు, స్మశాన వాటికల ఏర్పాటుకు కావాల్సిన స్థలాలను ఎంపిక చేయాలన్నారు.

మార్కెట్లకు స్థలాల ఎంపిక
రాష్ట్రంలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు ఎన్ని నిర్మించాలో ముందుగా నిర్ణయించుకుని, వాటికోసం స్థలాలను ఎంపిక చేయాలని సిఎం ఆదేశించారు. అలాగే – క్రీడా ప్రాంగణాలు, ఓపెన్ జిమ్ లు, – డంప్ యార్డుల ఏర్పాటు కోసం స్థలాలు గుర్తించాలన్నారు. అలాగే – పబ్లిక్ టాయిలెట్స్, మహిళల కోసం ప్రత్యేకంగా షి టాయిలెట్స్ నిర్మించాలని, వీటికోసం స్థలాలు గుర్తించాలన్నారు. ప్రభుత్వ స్థలాలను టాయిలెట్ల నిర్మాణానికి కేటాయించాలన్నారు. వీధులపై వ్యాపారం చేసుకునే వారికి ప్రత్యామ్నాయ స్థలం చూపించే వరకు వారిని ఇబ్బంది పెట్టొద్దని సిఎం ప్రత్యేకంగా ఆదేశించారు. అవసరమైతే ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను పార్కింగు కోసం వినియోగించాలన్నారు.

విద్యుత్ వ్యవస్థలో ఆధునిక పద్దతులు
పట్టణాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగు పర్చడానికి ఆధునిక పద్ధతులు అవలంభించాలని, ప్రమాద ర హిత విద్యుత్ వ్యవస్థ ఉండాలని సిఎం పేర్కొన్నారు. ర హదారులపై వంగిన స్తంభాలు, తుప్పు పట్టిన స్తంభా లు, రోడ్డు మధ్యలోని స్తంభాలు, ఫుట్ పాత్‌లపై ట్రాన్స్ ఫా రాలు వెంటనే మార్చాలన్నారు. రహదారుల్లో, పొలా ల్లో వేలాడే వైర్లను యుద్ధప్రాతిపదికన సరిచేయాలన్నారు.

రాజీవ్ స్వగృహ ఇళ్ళ వేలం
-రాజీవ్ స్వగృహ, అభయహస్తం, బంగారుతల్లి, వడ్డీలేనిరుణం తదితర పథకాల పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి తదుపరి నిర్ణయం తీసుకోవాలన్నారు. ముఖ్యంగా రాజీవ్ స్వగృహ ఇళ్ళను వేలం ద్వారా విక్రయించాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేయడానికి చిత్రా రామచంద్రన్ అధ్యక్షతన రామకృష్ణారావు, అరవిందకుమార్ సభ్యులుగా అధికారుల కమిటీని నియమించారు. అభయహస్తం పథకం సమీక్ష బాధ్యతను మంత్రి టి.హరీశ్ రావు, ఐఎఎస్ అధికారి సందీప్ సుల్తానియాలకు అప్పగించామన్నారు.తెలంగాణ లోకాయుక్త చట్టంపై తీసుకొచ్చిన ఆర్డినెన్సును కేబినెట్ ఆమోదించిందని, అసెంబ్లీ బడ్టెట్ సమావేశాల్లో లోకాయుక్త బిల్లు ప్రవేశ పెట్టాలని కేబినెట్ నిర్ణయించినట్లు తెలిపారు.

అధికారులకు అభినందనలు
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించినందుకు అధికార యంత్రాంగాన్ని కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ అభినందించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, రవాణాశాఖ మంత్రి అజయ్ కుమార్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటి రామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డిలను ప్రత్యేకంగా అభినందించారు.

సిఎఎ రద్దుపై అసెంబ్లీలో తీర్మానం
కేరళ, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల తరహాలోనే తెలంగాణ అసెంబ్లీలో సిఎఎ రద్దుకు సంబంధించి తీర్మానం చేయాలని కేబినెట్ నిర్ణయించినట్లు సిఎం వెల్లడించారు. భారత పౌరసత్వం ఇచ్చే విషయంలో మత పరమైన వివక్ష చూపరాదని తెలంగాణ రాష్ట్ర కేబెనెట్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. చట్టం ముందు అన్ని మతాలను సమానంగా చూడాలని కేంద్రానికి సిఎం విజ్ఞప్తి చేశారు. భారత రాజ్యాంగం ప్రసాదించిన లౌకికత్వాన్ని ప్రమాదంలో పడేసేలా పరిణమించిన సిటిజెన్ షిప్ (అమెండ్మెంట్) యాక్టును ర్దదు చేయాలని ఈ మేరకు కేబినెట్ లో నిర్ణయించినట్లు సిఎం తెలిపారు.

City should have good city Lifestyle
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News