Monday, April 29, 2024

ప్రగతి భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన సిఎం కెసిఆర్..

- Advertisement -
- Advertisement -

CM KCR Hoists national flag on 73rd Republic Day

హైదరాబాద్: 73వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతిపిత మహాత్మగాంధీ, రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. ఈ వేడుకల్లో సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎంఓ అధికారులు, తదితర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు సికింద్రాబాద్‌లోని ప‌రేడ్ గ్రౌండ్‌లోని అమర జవానుల స్మారక స్థూపం వ‌ద్ద‌కు సిఎం కెసిఆర్ వెళ్లి అమ‌ర‌వీరుల స్థూపం వ‌ద్ద జ్యోతి ప్రజ్వలన చేసి అమర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు.

CM KCR Hoists national flag on 73rd Republic Day

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News