- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు ముఖ్యమంత్రి కెసిఆర్ నివాళులు అర్పించారు. గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన సిఎం కెసిఆర్ రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపి సంతోష్ కుమార్, సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ అమరవీరులకు నివాళులర్పించారు. కాసేపట్లో సిఎం ప్రగతిభవన్లో జాతీయజెండా ఆవిష్కరించనున్నారు. రాష్ట్రంలో కరోనా కలవర పెడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి.
CM KCR paid tribute to the Telangana martyrs
- Advertisement -