Wednesday, May 15, 2024

రేపు తమిళనాడు సిఎం స్టాలిన్‌తో కెసిఆర్ భేటీ..

- Advertisement -
- Advertisement -

CM KCR to meet MK Stalin in Tamil Nadu

హైద‌రాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రేపు(మంగళవారం) త‌మిళ‌నాడు సిఎం ఎంకే స్టాలిన్‌తో భేటీ కానున్నారు. ఈ రోజు ఉదయం ప్రత్యేక విమానంలో కుటుంబంతో కలిసి తమిళనాడుకు బయల్దేరి వెళ్లిన సిఎం కెసిఆర్ తిరుచిరాప‌ల్లి జిల్లా శ్రీరంగంలోని రంగ‌నాథ‌స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆల‌య పండితులు సిఎం కెసిఆర్ కు పూర్ణ‌కుంభంతో ఆహ్వానం ప‌లికారు. సిఎం కెసిఆర్ రంగ‌నాథ‌స్వామికి ప్ర‌త్యేక పూజ‌లు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కుటుంబ స‌భ్యులతో కలిసి సిఎం గ‌జ‌రాజు నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. కాగా, ఈ పర్యటనలో భాగంగా రేపు తిరుత్తణిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత సిఎం స్టాలిన్‌తో కెసిఆర్ సమావేశం కానున్నారు. దీంతో ఈ రోజు రాత్రి ఐటిసి హోట‌ల్‌లో సిఎం కెసిఆర్ బ‌స చేయ‌నున్నారు.

CM KCR to meet MK Stalin in Tamil Nadu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News