Saturday, April 27, 2024

క్రైస్తవులకు గుడ్‌ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపిన సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి యేసు క్రీస్తు త్యాగాన్ని ధైర్యాన్ని గుర్తు చేసుకున్నారు. శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆయన క్రైస్తవులకు గుడ్‌ఫ్రైడే శుభాకాంక్షలు తెలియచేశారు. శాంతి, కరుణ సందేశాలతో పాటు క్రీస్తు నేర్పిన సేవ, దయ, సోదరభావం ఇప్పటికీ, ఎప్పటికీ మానవాళికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆయన అన్నారు. క్రీస్తు త్యాగాల జ్ఞాపకంగా జరుపుకునే గుడ్ ఫ్రైడే వేడుకలను క్రైస్తవ సోదర సోదరీమణులందరూ ఘనంగా జరుపుకోవాలని సిఎం రేవంత్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News