- Advertisement -
దేశ సరిహద్దుల్లోని గాల్వన్ లోయ వద్ద చైనా సైనికులతో జరిగిన పోరులో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్బాబు కుటుంబాన్ని హీరో విశ్వక్సేన్ పరామర్శించారు. శనివారం విశ్వక్సేన్ సూర్యాపేటకు వెళ్లి సంతోష్బాబు చిత్రపటానికి పూలతో నివాళులర్పించి… ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా విశ్వక్సేన్ మాట్లాడుతూ “దేశం కోసం ప్రాణాలర్పించిన కల్నల్ సంతోష్బాబును దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ప్రాణ త్యాగం చేసిన సైనికులకు మనం రుణపడి ఉంటాం”అని అన్నారు.
- Advertisement -