Sunday, April 28, 2024

నేడు రాజ్‌భవన్ వద్ద కాంగ్రెస్ ఆందోళన

- Advertisement -
- Advertisement -

Congress protest agitation at Raj Bhavan today

హైదరాబాద్ : రాజస్థాన్‌లో ప్రజల చేత ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిజెపి కుట్రలు చేస్తోందని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. బిజెపి అనుసరిస్తున్న వైఖరిని ఉత్తమ్ ఖండించారు. ఎఐసిసి ఆదేశాల మేరకు స్పీకప్ ఫర్ డెమోక్రసీ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఎంఎల్‌ఎలు, ఎంపిలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

రాజస్థాన్‌లో ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం ప్రజలు మాట్లాడాలని కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున నినదించారు. సామాజిక మాధ్యమాల్లో మాట్లాడిన కాంగ్రెస్ నేతలు రాజస్థాన్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఆరోపించారు. నేడు ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టనున్నట్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటల లోపు నేతలంతా గాంధీభవన్‌కు తరలిరావాలని సూచించారు.

Congress protest agitation at Raj Bhavan today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News