Sunday, May 5, 2024

24 గంటల్లో 591 పాజిటీవ్ కేసులు.. 20 మంది మృతి

- Advertisement -
- Advertisement -

lav agarwal

న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 591 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కాగా, 20 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ వెల్లడించారు. దేశంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 5,685 చేరిందని, ఇందులో 477 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ప్రస్తుతం 5,218 మందికి చికిత్స కొనసాగుతోందని పేర్కొన్నారు.ఇప్పటి వరకు కరోనాతో 169 మంది మరణించారని చెప్పారు.  కరోనా చికిత్స కోసం ప్రత్యేక ఆస్పత్రి నిర్మాణంపై చర్చలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటివరకు 5 వేల రైల్వే బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మార్చామని, పిపిఈలు, వెంటిలేటర్ల సరఫరా జరుగుతోందని లవ్ అగర్వాల్ వివరించారు.

Corona Cases raised to 5,685 in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News