- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్(కోవిండ్19) అనుమానిత కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే కరోనా అనుమానితుల సంఖ్య 457కు పెరిగింది. మంగళవారం ఒక్కరోజే శంషాబాద్ ఎయిర్ పోర్టులో 42 అనుమానిత కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం గాంధీలో ఒక్కటే పాజిటీవ్ కేసు నమోదైంది. దీంతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనాపై దుష్ప్రచారం జరగకుండా గాంధీ ఆసుపత్రి వద్ద మీడియాపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఇక మీదట గాంధీ ఆవరణలో మీడియాకు అనుమతి లేదని.. మీడియా ప్రతినిధులు, మీడియా వాహనాలను ఖాళీ చేయాల్సిందిగా పోలీసుల ఆదేశాలు జారీ చేశారు.
Corona Effect: Restrictions on Media at Gandhi Hospital
- Advertisement -