Monday, May 6, 2024

మైండ్ స్పేస్ లో డిఎస్ఎమ్ కంపెనీ ఉద్యోగికి కరోనా వైరస్?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాదాపూర్‌ లోని మైండ్ స్పేస్ లో ఉన్న డిఎస్‌ఎం కంపెనీలో ఓ ఉద్యోగికి కరోనా సోకినట్లు అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని బుధవారం డిఎస్ఎమ్ కంపెనీ తెలిసింది. తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తపేట మండలం వాడెపాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి డిఎస్ఎమ్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కంపెనీ విధుల్లో భాగంగా ఇటీవల దక్షిణ కొరియా వెళ్లిన ఉద్యోగి వారం రోజులు క్రితం తిరిగొచ్చాడు. ఆ తర్వాత మూడు రోజులపాటు వాడెపాలెంలో ఉన్న తమ ఉద్యోగికి కరోనా సోకినట్లు కంపెనీ తెలిపింది. దీంతో తమ ఉద్యోగులందరినీ కంపెనీ యాజమాన్యం ముందు జాగ్రత్తగా ఇళ్లకు పంపించింది. ఇంటి నుంచే వర్క చేయాలని ఉద్యోగులను ఆదేశించింది. మరోవైపు హైదరాబాద్‌లో కరోనా అనుమానితుల సంఖ్య పెరుగుతున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టినట్లు ఆరోగ్య శాఖమంత్రి ఈటెల రాజెందర్ పేర్కొన్నారు. కాగా, భారత్‌లో ఇప్పటికే 28 కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఓ ప్రకటనలో తెలిపింది.

Hyd Software Employee has tested positive for Covid19

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News