Monday, April 29, 2024

పిల్లల్లో కరోనా కొత్త వేరియంట్ లక్షణాలు…

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కొవిడ్ బారిన పడుతున్న పిల్లల్లో కళ్లు దురదగా ఉండటం, పుసులు కట్టడం వంటి లక్షణాలు ప్రస్తుతం ఎక్కువగా కనిపిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. గతంలో కరోనా బాధితుల్లో ఈ పరిస్థితి కనిపించలేదని పేర్కొన్నారు. కాబట్టి కొత్త వేరియంట్ వల్లే కళ్లలో పుసులు, దురద వస్తుండ వచ్చని అభిప్రాయపడ్డారు. వీటికి అదనంగా గతంలో ఉన్నట్లే అధిక జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఇప్పుడు కూడా కరోనా బాధితుల్లో కనిపిస్తున్నాయని చెప్రాఉ. దేశంలో కేసుల పెరుగుదలకు ఎక్స్‌బీబీ .1.16 లేదా ఆర్టురుస్‌గా పిలిచే కొత్త వేరియంట్ కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్న సంగతి గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News