Monday, April 29, 2024

సీజనల్ వ్యాధులతో ర్యాపిడ్ టెస్టులకు జనం బారులు

- Advertisement -
- Advertisement -

జలుబు,దగ్గు, జ్వరంతో బస్తీ దవఖానలకు పరుగులు
ఇటీవల కురిసిన వానలకు విజృంభిస్తున్న వ్యాధులు
రోజుకు 60నుంచి 70 మందికి పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది
నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పు తప్పదంటున్న జిల్లా వైద్యాధికారులు

Corona rapid test increased with Seasonal fever

 

మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో ఇటీవల కురిసిన బారీ వర్షాలకు ప్రజలు జలుబు, దగ్గు, జ్వరం వంటి రోగాలతో బాధపడుతూ కరోనా సోకే ప్రమాదముందని త్వరగా వ్యాధులను గుర్తించేందుకు ర్యాపిడ్ టెస్టుల కోసం బస్తీ దవాఖానలు, ఆరోగ్య కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్నారు. ఫీవర్ ఆసుపత్రికి రోజుకు 300మందికిపైగా రోగులు వస్తున్నట్లు సిబ్బంది పేర్కొంటున్నారు. రెండు నెలలుగా వానలు బారీగా కురిసిన పలు ప్రాంతాల్లోని బస్తీలు, కాలనీ ఇంకా బురదమయంగా ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజల పరిస్దితి చెప్పనక్కరలేదు.

వాన కురిసితే వరద, తరువాత బురదతో దోమలు విస్తరించి రాత్రింబళ్లు తేడా లేకుంటా కాటు వేయడంతో చాలామంది డెంగ్యూ, మలేరియా వంటి వ్యాదులకు గురైతూ చికిత్సల కోసం ప్రభుత్వ ఆసుపత్రులు బాట పడుతున్నారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది ముందుగా టెస్టులు నిర్వహించి వ్యాధులను నిర్దారించి కావాల్సిన చికిత్స అందిస్తున్నారు. పాజిటివ్ వస్తే వెంటనే గాందీ, టిమ్స్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు. రోజుకు 60 నుంచి 70మంది పరీక్షల కోసం వస్తున్నట్లు పట్టణ ఆరోగ్య కేంద్రాల సిబ్బంది పేర్కొంటున్నారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అందుబాటులో ఉండి రోగులకు పలు రకాల సేవలందిస్తున్నట్లు చెబుతున్నారు. నగరంలో 196 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీదవఖానలో ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల నుంచి వైద్యంకోసం వచ్చే రోగుల సంఖ్య పెరిగిందంటున్నారు.

అక్టోబర్, నవంబర్‌లో ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యం కాపాడుకోవచ్చని వైద్యశాఖ పేర్కొనడంతో నగర ప్రజలు వైరస్ లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేసుకుంటున్నారని కేంద్రాలు సిబ్బంది చెబుతున్నారు. ఈఏడాది వర్షాలు విస్తరంగా కురువడంతో చలి తీవ్రత ఎక్కువగా ఉందని,దీంతో జలుబు, దగ్గు,జ్వరం, మలేరియా, టైపాయిడ్ వ్యాధులతో బాధపడే వారి సంఖ్య పెరుగుతుందని జిల్లా వైద్యశాఖ పేర్కొంటున్నారు.దీని దృష్టిలో పెట్టుకుని సరిపడ కిట్లు, సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. వచ్చే నెల రోజుల పాటు వరుసగా పండగలు ఉండటంతో కరోనా ఉనికిచాటే అవకాశముందని, వేడుకలను పరిమిత సంఖ్యలో చేయాలని, ఒకే దగ్గర గుంపులుగా ఉండి విందులు చేస్తే మహమ్మారి పంజా విసురుతుందని, ఇప్పటికి రోజు 55 నుంచి 60వరకు పాజిటివ్ కేసులు నమోదైతున్నట్లు, ప్రజలు కొవిడ్ జాగ్రత్తలు పాటించి, ఆరోగ్యం కాపాడుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News