Friday, April 26, 2024

సూర్యాపేటలో దంపతుల ఆత్మహత్యాయత్నం..

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: జిల్లా పట్టణంలో దంపతుల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక దంపతులు వంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి స్థానికులు వారిని అడ్డుకున్నారు. అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని, తనకు న్యాయ చేయాలని బాధితులు ఆవేధన వ్యక్తం చేశారు. రమేష్ అనే వ్యక్తి నంద్యాల్ సురేష్ రెడ్డి వద్ద నుంచి రూ. 11.50లక్షలు అప్పుగా తీసుకున్నాడు. పది రూపాల వడ్డీ కావడంతో వడ్డీపై వడ్డీ చెల్లించుకుంటూ మొత్తం రూ.80 లక్షల వరకు చెల్లించాడు. అప్పు చెల్లించేందుకు రమేష్ తన ఇంటిని, స్థలాన్ని అమ్మి మరీ బాకీ తీర్చాడు. అయితే, ఇంకా రూ.30 లక్షలు కట్టాలని వేధించాడు. డబ్బులు కట్టకపోతే చంపుతామని బెధిరించడంతో రమేష్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు పట్టించుకోకపోవడంతో మనస్థాపానికి గురైన రమేష్ తన కొడుకు, భార్యతో కలిసి వడ్డీ వ్యాపారి కార్యాలయంలో వెళ్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Couple Suicide attempt at Suryapet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News