Saturday, April 27, 2024

దేశంలో తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు

- Advertisement -
- Advertisement -

18346 New Corona Cases Reported in India

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంట‌ల్లో 11.41లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా.. కొత్తగా 18,346 క‌రోనా పాజిటివ్ కేసులు కొత్త‌గా న‌మోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. ఇక, కరోనాతో మరో 263మంది బాధితరులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 3.39కోట్లు దాటింది. ఇప్పటివరకు దేశంలో కరోనాతో 4,49,260 మంది బాధితులు మరణించారు. గత 24 గంటల్లో 29,639మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3.31కోట్లకు పైగా మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 2,52,902 లక్షల కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 72.51లక్షల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశామని, ఇప్పటివరకు దేశంలో 91.54కోట్లకు పైగా వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

18346 New Corona Cases Reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News