Saturday, May 11, 2024

విద్యుత్‌షాక్‌తో ఆవు మృతి

- Advertisement -
- Advertisement -

కల్హేర్: సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల పరిధిలోని బల్కంచెల్కాతండాలో తెల్లవారు జామున కాత్రోషానుబాయ్‌కి చెందిన ఆవు ఎర్తి లైన్ తగిలి మృతిచెందింది. ఈ విషయాన్ని గమనించి స్థానికులు లైన్‌మెన్ కిషన్‌కు సమాచారం అందజేశారు. సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి వెటర్నరీ డాక్టర్ గీత పోస్టుమార్టం నిర్వహించారు. ఆవు విలువ రూ.70వేల నుంచి రూ.80వేల వరకు ఉంటుందని అంచనా వేశారు. న్యాయం చేయాలని కుటుంబీకులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News