హైదరాబాద్: ఐపిఎల్ క్రికెట్పై బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు నిందితులను వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.10,500, మూడు మొబైల్ ఫోన్లు, క్యాలికులేటర్లు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్కు చెందిన ప్రతీక్ అగర్వాల్ అలియాస్ బంటీ నగరంలోని జగదీష్మార్కెట్లో మొబైల్స్ వ్యాపారం చేస్తున్నాడు. నగరంలోని ఆఘాపూరాకు చెందిన అరుణ్కుమార్ శర్మ, రాజస్థాన్కు చెందిన వికాస్ అగర్వాల్ కలిసి బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు.
మొబైల్స్ వ్యాపారం చేస్తున్న ప్రతీక్కు వస్తున్న డబ్బులు కుటుంబ అవసరాలకు సరిపోవడంలేదు. దీంతో మిగతా ఇద్దరితో కలిసి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. యాప్ల ద్వారా తెలిసిన వారి నుంచి తెలియని వారిని నుంచి బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. దాదాపుగా 15 నుంచి 20మంది పంటర్ల సాయంతో బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఐపిఎల్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. టాస్క్ఫోర్స్ ఓఎస్డి రాధాకిషన్రావు పర్యవేక్షణలో ఇన్స్స్పెక్టర్ గట్టుమల్లు, ఎస్సైలు కలిసి పట్టుకున్నారు.