Monday, April 29, 2024

అగ్నిప్రమాదంలో తండ్రి, ఇద్దరు కుమారులు మృతి…. కూతురు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Daughter commit suicide in veluru

చెన్నై: బాణసంచా దుకాణంలో జరిగిన అగ్నిప్రమాదంలో తండ్రి, ఇద్దరు కుమారులు చనిపోవడంతో వివాహిత రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడులోని వేలూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మోహన్ రెడ్డి (60) అనే వ్యక్తికి కాట్పాడి సమీపంలోని లత్తేరి గ్రామంలో బస్టాండ్ లో బాణసంచా దుకాణం నిర్వహిస్తున్నాడు. అతడిని విద్య(33) అనే కుమార్తె ఉంది. పది సంవత్సరాల క్రితం నరేష్ అనే వ్యక్తితో ఆమెకు పెళ్లి చేశారు. నరేష్-విద్య అనే దంపతులకు తేజశ్వరన్(08), ధనూజ్(06) ఇద్దరు పిల్లులు ఉన్నారు. దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో విద్య తల్లి ఇంటికి లత్తేరి గ్రామానికి వచ్చింది. ఈ నెల 18న మోహన్ రెడ్డి తన మనవళ్లు తేజశ్వరన్, ధనూజ్ ను బాణసంచా దుకాణానికి తీసుకెళ్లాడు. దుకాణంలో జరిగిన అగ్నిప్రమాదంలో మోహన్ రెడ్డి, ఇద్దరు మనవళ్లు మృతి చెందారు. దీంతో విద్య మనో వేధనకు గురైంది. లత్తేరి గ్రామ సమీపంలో రైల్వే స్టేషన్ లో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. జోలార్ పేట రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News