Friday, May 3, 2024

ఢిల్లీలో మరోవారం పాటు లాక్‌డౌన్

- Advertisement -
- Advertisement -

Delhi government is to extend lockdown

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో లాక్‌డౌన్‌ను మే 24 వరకు పొడిగించబడింది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా లాక్‌డౌన్‌ను మరో వారం పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం వెల్లడించారు. ఢిల్లీలో రికవరీ రేటు పెరుగుతోందని, పాజిటివిటీ రేటు తగ్గుతోందన్నారు. లాక్‌డౌన్‌లో ఆర్థిక కార్యకలాపాలు నిషేధించబడ్డాయని ఆయన పేర్కొన్నారు. మెట్రో సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేయబడతాయని చెప్పారు. ప్రభుత్వ బస్సులు అవసరమైన సర్వీసులు అందుబాటులో ఉంటాయని కేజ్రీవాల్ తెలిపారు. ఏప్రిల్ 19న తొలిసారిగా విధించిన లాక్‌డౌన్ దేశ రాజధానిలో విస్తరించడం నాల్గవసారి. ఇది సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు ముగియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News