- Advertisement -
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 77,103 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,491 కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజాగా మరో 130 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 3,952 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14,21,477కి చేరింది. ఢిల్లీలో ప్రస్తుతం 19,148 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కరోనా పాజిటివిటీ రేటు 1.93శాతం ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో ప్రకటించింది.
Delhi | Positivity rate below 2% (1.93%), total active cases at 19,148 #COVID19 https://t.co/e7LBe61sqd
— ANI (@ANI) May 26, 2021
- Advertisement -