Friday, April 26, 2024

ఢిల్లీలో ఉద్రిక్తత పరిస్థితులు.. అధికారులు, ఎంఎల్ఎలతో కేజ్రీవాల్ సమావేశం

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో సిఎఎకు వ్యతిరేకంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన నివాసంలో ఎంఎల్ఎలు, అధికారులతో సమావేశం నిర్వహించారు. మరోసారి సిఎఎకు అనుకూల, వ్యతిరేక గ్రూపుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. సోమవారం ఈశాన్య ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఘర్షణలో ఓ కానిస్టేబుల్ తోపాటు మరో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పాగా.. 105 మంది గాయపడ్డారు. దీంతో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. ఈ రోజు ఉదయం సిఎం కెజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్లతో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు.

Delhi Violence: Kejriwal Holds Meeting with Officials, MLAs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News