విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ సందీప్ వంగా. ఈ చిత్రాన్ని హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా భారీ బ్లాక్బస్టర్ అందుకొని ఏకంగా బాలీవుడ్లోనే స్టార్ డైరెక్టర్గా మంచి క్రేజ్ సంపాదించాడు. ఇక కరోనా లాక్ డౌన్ సమయంలో సందీప్ రెండు స్క్రిప్ట్లను సిద్ధం చేశాడట. వాటిలో ఒకటి విజయ్ దేవరకొండ కోసమట. అయితే ఈ సినిమా సెట్స్పైకి రావడానికి మరో రెండేళ్ల సమయం పడుతుంది. మొత్తానికి ‘అర్జున్ రెడ్డి’ కాంబోలో మరో సినిమా రాబోతుంది. ప్రస్తుతం సందీప్ మరో హిందీ సినిమా చేసే ప్లాన్ లో ఉన్నాడు. ‘కబీర్ సింగ్’ సినిమా నిర్మాత టీ-సిరీస్ భూషణ్ కుమార్, సినీ 1 స్టూడియోస్ మురాద్ ఖేతానితో కలిసి సందీప్ తర్వాతి సినిమాను కూడా భారీ స్థాయిలో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాదట. వీరితో పాటే సందీప్ సోదరుడు, ‘అర్జున్ రెడ్డి’ నిర్మాత ప్రణయ్ వంగా కూడా ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకోనున్నాడు.