- Advertisement -
కరోనా లాక్డౌన్తో నిస్సహాయులైపోయిన పేదలకు సహాయ సహకారాలందించడంలో ‘మనం సైతం’ సేవా సంస్థ అందరికంటే ముందుగా స్పందించింది. సంస్థ వ్యవస్థాపకులు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో ‘మనం సైతం’ నిత్యావసర వస్తువుల రూపంలో సేవలు అందించిన సినీ కార్మికులు, పేదల సంఖ్య 3000కి చేరువ కావడం విశేషం. ఈ సందర్భంగా సేవలు అందుకున్న పేదలు మనసారా దీవిస్తుండగా ….పెద్దలు వెన్నుదన్నుగా నిలవడం ‘మనం సైతం’ సేవలను మరింత విస్తృతం చేయడానికి ధైర్యాన్నిచ్చిందని కాదంబరి కిరణ్ పేర్కొన్నారు. అందరి మద్దతుతో తమ సేవలను కొనసాగిస్తూనే ఉంటామని ఆయన తెలిపారు.
Distribution of Essential Goods for 3000 persons
- Advertisement -