Monday, April 29, 2024

రానున్నది డబుల్ ఇంజిన్ సర్కార్ : అమిత్ షా

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. మంగళవారం ఆదిలాబాద్‌లో బిజెపి జనగర్జన సభలో, హైదరాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో మేధావులతో నిర్వహించిన సమావేశంలో అమిత్ షా మాట్లాడారు. వచ్చే 50 ఏళ్లలో ప్రపంచంలోనే భారత్ కీలక పాత్ర పోషించబోతోందన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలో తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు.

డిసెంబరు 3న హైదరాబాద్‌లో బిజెపి జెండా ఎగరాలి. బిజెపి తెలంగాణలో అధికారికంలోకి రాగానే గ్రామగ్రామాన తెలంగాణ విమోచన దినోత్సవాలు అధికారికంగా నిర్వహిస్తాం. ముఖ్యమంత్రి వైఖరి కారణంగా గిరిజన వర్సిటీ ఏర్పాటు ఆలస్యమైంది. గిరిజన వర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం స్థలం చూపించలేదు.. అందుకే ఆలస్యమైంది. కృష్ణా ట్రైబ్యునల్ నిబంధనలు మార్చి రాష్ట్రానికి నీటి ఇబ్బంది లేకుండా చేశాం. రాష్ట్ర ప్రభుత్వం. రైతులు, దళితులు, గిరిజనులను పట్టించుకోలేదు. మోడీ ప్రభుత్వం చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించిందని అమిత్ షా వెల్లడించారు. బిజెపి పాలనలో 12 కోట్ల మందికి ఇళ్లు ఇచ్చాం. 9 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని వెల్లడించారు. బిజెపి.. సిద్ధాంతాల ఆధారంగా నడిచే పార్టీ… బిఆర్‌ఎస్ కుటుంబ పార్టీ.. ఇలాంటి పార్టీలు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండవు. కెటిఆర్‌ను ముఖ్యమంత్రిగా చేయడం తప్ప కెసిఆర్‌కు ఏముందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పేదల కోసం చేసిందేమీ లేదని విమర్శించారు.

అడ్డంకులను అధిగమించి రామమందిరం నిర్మాణం..
‘అయోధ్యలో రామమందిరం కట్టాలా? వద్దా? చెప్పండి? అడ్డంకులను అధిగమించి మోడీ సర్కారు రామమందిరం నిర్మిస్తోంది. ఆర్టికల్ 370 ఎత్తివేసి కశ్మీర్కు విముక్తి కల్పించింది. సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించి శత్రువులను తరిమికొట్టింది. తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ చేశానని కెసిఆర్ చెబుతుంటారు.. రైతులు ఆత్మహత్యల విషయంలో, అవినీతి విషయంలో తెలంగాణను నెంబర్ వన్ చేశారు. బిఆర్‌ఎస్ ఎన్నికల గుర్తు కారు.. కానీ, ఆ కారు స్టీరింగ్ మాత్రం ఒవైసీ దగ్గర ఉంటుంది. ఎంఐఎం దగ్గర స్టీరింగ్ ఉన్న బిఆర్‌ఎస్ అవసరమా?’ అని ఆయన ప్రశ్నించారు.

బిజెపికి రాష్ట్ర ప్రజలు మద్దతు పలకాలని కోరారు. మూడోసారి మోడీ సర్కార్ రాగానే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక దేశంగా మారనుంది. 220 కోట్ల మందికి మోదీ ఉచిత వాక్సిన్ అందించిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వానిదే అని అమిత్ షా వెల్లడించారు. బహిరంగ సభలో బిజెపి అగ్రనేతలు తరుణ్‌చుగ్, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జాతీయ కార్యదర్శి బండి సంజయ్, డాక్టర్ లక్ష్మణ్, సోయం బాబురావు, ఈటల రాజేందర్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News