Friday, May 3, 2024

యువత సమస్యలపై సినిమా

- Advertisement -
- Advertisement -

శ్రీ పుష్పాంజలి క్రియేషన్స్ సమర్పణలో ఎస్‌ఎస్‌సి క్రియేషన్స్, రుద్రాని స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ఏది నిజం’ చిత్రాన్ని సీనియర్ నటులు బాబూమోహన్ చేతుల మీదుగా హైదరాబాద్‌లో ప్రారంభించారు. శ్రీకృష్ణానగర్ ఆంజనేయ స్వామి టెంపుల్‌లో ఘనంగా పూజా కార్యక్రమా లు జరిగాయి. ఈ సందర్భంగా బాబుమోహన్ మాట్లాడుతూ మంచి కంటెంట్ ఉన్న సబ్జెక్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఘన విజయం సాధించాలని అన్నారు. దర్శకులు సంపత్ శ్రీను మాట్లాడుతూ “మంచి కథతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఐదుగురు నటీనటులు ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. పల్లెటూరు, పట్టణ ప్రాంతాల్లో యువత సమస్యలపై తీస్తున్న సినిమా ఇది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో రవికుమార్, జబర్దస్త్ యన్.అప్పారావు పాల్గొన్నారు. ఐశ్వర్య, హాన్విక హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతంః శ్రాన్, ఎడిటింగ్‌ః రుద్రాని స్టూడియోస్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News