Wednesday, May 1, 2024

రేపు ముస్లింల పర్వదినం ’ఈద్ మిలాద్-ఉన్-నబీ‘

- Advertisement -
- Advertisement -

Eid Milad un Nabi

హైదరాబాద్: దేశవ్యాప్తంగా రేపు(మంగళవారం,అక్టోబర్19న) ముస్లింలు తమ పర్వదినం ‘మిలాద్-ఉన్-నబీ’ జరుపుకోబోతున్నారు. ఈ పండుగ ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం వేర్వేరు తేదీల్లో వస్తుంటుంది. క్రిష్టియన్ క్యాలెండర్‌తో పోల్చి చూసినప్పుడు వేర్వేరు తేదీల్లో కనిపిస్తుంది. ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ పండుగను ముస్లింలు చేసుకుంటారు. ఆయన సౌదీ అరేబియాలోని మక్కాలో క్రీ. శ. 570లో జన్మించి క్రీ. శ.632 వరకు జీవించి అదే రోజున(తేదీన) కాలధర్మం చేశారు. ముస్లింల చాంద్ర మాన క్యాలండర్ ప్రకారం ఈద్ మిలాద్-ఉన్-నబీ వారి రబీవుల్ అవ్వల్ మాసంలో జరుపుకుంటారు. ముస్లింల విశ్వాసం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ చివరి ప్రవక్త.

ఈ పండుగ రోజున ప్రార్థనలు, ఖురాన్ పఠనం, మసీదుల్లో ప్రసంగాలు వంటివి వారు జరుపుకుంటారు. అయితే ఈ పండుగ విషయంలో ముస్లింలలో రెండు తెగలవారు అంటే, సున్నీలు, షియాలు వేర్వేరు భావాలు కలిగి ఉన్నారు. ఆకుపచ్చని రిబ్బన్లు, జెండాలు, బ్యానర్లు వంటివి ఈ రోజున ముస్లింలు ప్రదర్శిస్తారు. మసీదులు, ఇతర కమ్యూనిటీ భవనాల్లో అన్నదానం, రాత్రుల్లో సైతం మసీదుల్లో ప్రార్థనలు జరుపుతారు ఈ రోజున. ముస్లింలలోని చాలా తెగలవారు ప్రవక్త పుట్టిన రోజును ఓ పర్వదినంగా భావించరు. ముస్లింలలోని సలాఫీ, వహబీ సిద్ధాంతాలున్నవారు ఈ రోజును పర్వదినంగా ఆచరించరు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News