Monday, April 29, 2024

హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన మలాన్, రూట్

- Advertisement -
- Advertisement -

England scored 269 runs for two wickets

హిడింగ్లే: లీడ్స్ మైదానంలో ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో తొలి ఇన్నింగ్స్ రెండో రోజు ఇంగ్లాండ్ జట్టు 87 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 269 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 191 పరుగుల ఆధిక్యంలో ఉంది. మలాన్, రూట్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. రెండో వికెట్‌పై రూట్, మలాన్ వంద పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పారు. రోరీ బర్న్ 61 పరుగులు చేసి షమీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ఓపెనర్లు 135 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. హసీబ్ హమీద్ 68 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ప్రస్తుతం క్రీజులో డావిడ్ మలాన్(56), జోయ్ రూట్(65) బ్యాటింగ్ చేస్తున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 78 పరుగులు చేసి ఆలౌటైన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News