Monday, April 29, 2024

ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్ 149

- Advertisement -
- Advertisement -

England loss 5th wicket for 149 runs

కెన్నింగ్‌టన్: ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్-ఇండియా మధ్య జరుగుతున్న నాల్గో టెస్టు ఐదో రోజు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు 68 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 149 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం భారత్ 219 పరుగుల ఆధిక్యంలో ఉంది. రోరీ బర్న్, హసీబ్ హమీద్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. జానీ బయిర్ స్టో పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో ఔటయ్యాడు. ఓలీ పోప్ రెండు పరుగులు చేసి బుమ్రా బౌలింగ్ క్లీన్ బౌల్డయ్యాడు. హామీద్ 63 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. డావిడ్ మలాన్ ఐదు పరుగులు చేసి రనౌట్ రూపంలో మైదానం వీడాడు. రోరీ బర్న్ 50 పరుగులు చేసి శార్థూల్ టాకూర్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తొలి వికెట్‌పై ఓపెనర్లు వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం క్రీజులో జోయ్ రూట్ (18), మోయిన్ అలీ(0) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. భారత బౌలర్లు బుమ్రా, జడేజా చెరో రెండు వికెట్లు తీయగా శార్ధూల్ టాగూర్ ఒక వికెట్ తీశాడు.

 

ఇండియా తొలి ఇన్నింగ్స్: 191

ఇండియా రెండో ఇన్నింగ్స్: 466

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్:290

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News