Monday, May 6, 2024

నౌకాదళ వాయు విభాగానికి ప్రెసిడెంట్ కలర్ అవార్డు ప్రదానం

- Advertisement -
- Advertisement -

Indian Navy's aviation wing receives President's Colour award

 

పణాజీ: గోవాకు సమీపంలోని ఐఎన్‌ఎస్ హంసా కేంద్రంలో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో భారత నౌకాదళ వాయు విభాగానికి ప్రెసిడెంట్ కలర్ అవార్డును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అందచేశారు. ఈ సందర్భంగా భారత నౌకాదళం అందచేసిన గౌరవ వందనాన్ని రాష్ట్రపతి కోవింద్ స్వీకరించారు. మూడు రోజుల గోవా పర్యటనలో ఉన్న కోవింద్ నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ కరంబీర్ సింగ్ సమక్షంలో నౌకాదళ వాయు విభాగానికి ప్రెసిడెంట్ కలర్ అవార్డును ప్రదానం చేశారు. గోవా గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిళ్లై, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోవా రాజధాని పణాజీకి 40 కిలోమీటర్ల దూరంని వాస్కో పట్టణంలో ఐఎన్‌ఎస్ హంసా కేంద్రంలో ఈ ఉత్సవం జరిగింది. దేశానికి అందచేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా సైనిక విభాగానికి అందచేసే అత్యన్నత గౌరవ పురస్కారంగా ప్రెసిడెంట్ కలర్ అవార్డును పరిగణిస్తారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News