Saturday, May 4, 2024

వరుస వర్షాలతో అప్రమత్తమైన విద్యుత్‌శాఖ అధికారులు

- Advertisement -
- Advertisement -
Vigilant power officials with consecutive rains
అదనపు ట్రాన్స్‌ఫార్మర్లును ఏర్పాటు చేశాం: అధికారులు

హైదరాబాద్: గత కొద్ది రోజులుగా నగరంలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతుండటంతో విద్యుత్‌శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే పటిష్టమైన చర్యలకు సిద్దమైన అధికారులు విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పాత విద్యుత్ తీగల లైన్ల పునరుద్దరణతో పాటు కొత్తవి అందుబాటులోకి తీసుకు రావడం, చెట్లకొమ్మలను తొలగించడం, నేలకొరిగిన విద్యుత్ స్తంభాల తొలగింపు వంటి కార్యక్రమాలను చేపట్టారు. వర్షాకాలంలో ట్రాన్స్‌ఫార్మర్లు ఎక్కువగా రిపేరు అయ్యే అవకాశం ఉండంటంతో ఒక్కో సర్కిల్లో 50 నుంచి 80 ట్రాన్స్‌ఫార్మర్లను అదనంగా సిద్దం చేశారు. అంతరాయాలు ఏర్పడితే మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్లతో విద్యుత్ అందించే విధంగా చర్యలు తీసుకున్నారు. చెట్లు విరిగిన ప్రాంతాల్లో మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసి ఏవీ కేబుళ్ళతో విద్యుత్ సరఫరా అందించే ప్రత్యామ్నాయ మార్గాలను సిద్దం చేశారు.

ఏ చిన్న గాలి వచ్చినా వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోతుండటంతో వాటిని నివారించేందుకు చెట్లు ఉన్న ప్రాంతాల్లో 800- 100 మీటర్ల ఎల్ ఏవీ(లో టెన్షన్ ఎయిర్ బంచ్ )కేబుల్స్ ఏర్పాటు చేశారు. గ్రేటర్ జోన్‌లో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ కేబుల్స్ వినియోగిస్తున్నారు. విద్యుత్ శాఖ నగర వ్యాప్తంగా చెట్లు ఉన్న ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఫీడర్లలో ట్రిప్పింగ్, బ్రేక్‌డౌన్స్ సమస్యలు తల్తెకుండా ఉండేందుకు ఎల్‌టిఏవీ కేబుల్స్ ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు. వీటి వినియోగంతో విద్యుత్ ప్రమాదాలు జరగవని ఇంజనీర్లు చెబుతున్నారు. చెట్ల మధ్యలో ఎల్‌టిఏవీ కేబుల్స్ ఉన్నా సరఫరాలో ఎటువంటి అంతరాయాలు తలెత్తవంటున్నారు. అధికారులు చెబుతున్నారు. గతంలో గాలి వానకు చోటు చేసుకున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ కేబుల్స్ ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.

విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఒక్కో సర్కిల్లో 6 నుంచి 8 కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామని చెబుతున్నారు. సీబీడీ( సెంట్రల్ బ్రేక్ డౌన్ గ్యాంగులు ) లైన్ సిబ్బంది 24 గంటలు విధుల్లో ఉండే విధంగా షిఫ్ట్ పద్దతులు ఏర్పాటు చేశారు. విద్యుత్ పరికరాల మరమ్మత్తులకు చేతి గ్లౌజ్, ఏర్త్‌రాడ్, ఉండేలా చర్యలు తీసుకోవడమే కాకుండా ఏడీఈ ఆధ్వర్యంలో అన్ని విభాగాలకు చెందిన నలుగురు ఏఈలు, కంట్రోల్ రూంకు వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా ఏర్పాట్లు చేశారు .చెట్లు విరిగిన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్దరణకు 20 నుంచి 25 డిజాస్టర్ టీమ్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని, ఈ టీమ్‌లో కనస్ట్రక్షన్,లైన్స్, ఆపరేషన్ అధికారులతో పాటు డైరక్టర్ స్థాయి అధికారులు పాల్గొంటారన్నారు. డిజాస్టర్ టీమ్‌లను ఎఫ్ ఓసీ,సీబీడీలకు అనుసంధానం చేయడమే కాకుండా డిజాస్టర్ టీమ్‌లో ఐదుగురు అధికారులు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News