Monday, April 29, 2024

ఈటెలపై ఫిర్యాదు చేసిన టిఆర్ఎస్ పార్టీ

- Advertisement -
- Advertisement -

Etela rajender complaint by TRS Party

హుజూరాబాద్: టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై అసత్య ఆరోపణలు, తీవ్ర నేరారోపణతో కూడిన కేసులో ఇరికించే ప్రయత్నం చేసిన బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ పైన,ఆ పార్టీపైన ఎన్నికల కమిషన్ కు టిఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. టిఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై బిజెపి అభ్యర్థి దుష్ప్రచారం చేస్తూ లబ్ధిపొందే ప్రయత్నంపై ఎన్నికల కమిషన్ కు టిఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. టిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నేత జగన్ పై బిజెపి నేతల దాడి పై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. హుజూరాబాద్ లో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తూ రోడ్ నిర్వహించడంపై ఎన్నికల సంఘానికి టిఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. టిఆర్ఎస్ డబ్బులు ఇస్తుందని దుష్ప్రచారం చేయడంతో పాటు, డబ్బులు తీసుకోమ్మని బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ఓటర్లును తప్పుదోవ పట్టించడంతో పాటు టిఆర్ఎస్ మీద తప్పుడు ప్రచారం చేయడంపైన ఎన్నికల కమిషన్ కు టిఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. అన్ని కేసులపై ఆధారాలతో  టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News