Monday, April 29, 2024

ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా మొక్కలు నాటాలి.. సంరక్షించాలి…

- Advertisement -
- Advertisement -

మంత్రి ఈటల రాజేందర్

 

మన తెలంగాణ/హైదరాబాద్ : తన పుట్టినరోజు సందర్భాని పురస్కరించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శనివారం మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ పిలుపు మేరకు శనివారం హుజూరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ తన పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటడం జరిగిందని అన్నారు. సంవత్సర కాలం నుండి కరోనా వైరస్ కారణంగా అందరం బాధపడుతున్నామని, దీనంతటికి కారణం వాతావరణంలో మార్పులు, పచ్చని వాతావరణంలో ప్రకృతితో కలిసి జీవించిన వారికి కరోనా వ్యాధి దరిచేరలేదు కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని తెలిపారు. అదే విధంగా తన పుట్టిన రోజు సందర్భంగా పార్టీ నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా మొక్కలు నాటి తనకు శుభాకాక్షంలు తెలియజేయాలని పిలుపునిచ్చారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటాలని చెప్పిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌కి కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News