Monday, May 6, 2024

కెసిఆర్ ఆలోచనకు అనుగుణంగా ప్రతి ఎకరాకు నీరందేలా చూడాలి

- Advertisement -
- Advertisement -

 

అధికారులను ఆదేశించిన మంత్రి సత్యవతి రాథోడ్

మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచన మేరకు రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరందేలా చూడాలని అధికారులను రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఆదేశించారు. శనివారం దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్‌లో ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ ఛీప్ మురళీధర్ రావు, సీతారామ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ వెంకట కృష్ణ, ఎస్‌ఆర్‌ఎస్‌పి ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ శంకర్, సూపరింటెండెంట్ ఇంజనీర్లు, డిప్యూటీ ఇంజనీర్లతో మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇల్లందు నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు నీరు వచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించాలని, ఎన్ని ఎకరాలకు నీటి వసతి ఉంది, తదితర విషయాలపై వెంటనే సర్వే చేయాలని, నివేదికను పది రోజుల్లో ఇవ్వాలని ఆమె అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు ఆ ప్రాంతంలోని ప్రతి ఎకరాకు నీరు అందే మార్గాలు, వసతులు, నీటి లభ్యత, అవసరంపై సమగ్ర ప్రణాళిక రూపొందించి సమర్పించాలన్నారు.

సాధ్యా, సాధ్యాలను నివేదికలో పొందుపర్చాలి: మురళీధర్ రావు

ప్రస్తుతం ఉన్న చెరువులు విస్తీర్ణం పెంచుకోవడం వల్ల నీరందించే అవకాశం ఎంతవరకు ఉంది, లేనిపక్షంలో కొత్తగా రిజర్వాయర్ నిర్మించడానికి సాధ్యాసాధ్యాలను నివేదికలో పొందుపర్చాలని ఇంజనీర్ ఇన్ ఛీప్ మురళీధర్ రావు అధికారులకు సూచించారు. సీతారామ ప్రాజెక్టును రోళ్లపాడు, లలితాపూర్ ట్యాంక్ నుంచి బయ్యారం ట్యాంక్ వరకు పొడిగించే విధంగా చూడాలన్నారు. ఇల్లందు నియోజక వర్గంలో చివరి ఎకరాకు కూడా నీరందించేందుకు మార్గాలను సూచిస్తూ నివేదిక ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అపర భగీరథ ప్రయత్నం కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మహబూబాబాద్ జిల్లాలో ఎండాకాలంలో చెరువులు మత్తడి పోస్తున్నాయని, ఈ చెరువుల్లోని నీరు ప్రతి ఎకరాకు చేరే విధంగా ఓటీలు నిర్మించాలన్నారు. ఈ రెండు నెలల్లో కాలువల నిర్మాణం, మరమ్మతులు, ఓటీలు పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరందించేలా పనులు ప్రారంభించాలన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News