Saturday, April 27, 2024

దేశాన్ని రక్షించా కానీ.. భార్యను కాపాడుకోలేకపోయా

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్: మణిపూర్‌లో ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటన యావత్ దేశాన్ని కలవరపాటుకు గురి చేసిన విషయం తెలిసిందే. ఆయుధాలు ధరించిన అల్లరి మూక గ్రామంపై దాడి చేసి ఇళ్లకు నిప్పుపెట్టియథేచ్ఛగా అత్యాచారాలు, హత్యలు చేసినఆ ఘటనలో ఓ కీలక విషయం వెల్లడయింది. దేశం సిగ్గుపడేలా చేసిన ఆ ఘటనలో ఓ బాధితురాలు ఓ మాజీ సైనికుడి భార్య అని తెలిసింది. దీనిపై స్పందించిన ఆ బాధిత మహిళ భర్త, మాజీ సైనికుడు మాట్లాడుతూ.. కార్గిల్ యుద్ధ సమయంలో దేశాన్ని రక్షించుకున్నప్పటికీ ఈ అమానవీయ ఘటననుంచి తన భార్యను మాత్రం కాపాడుకోలేకపోయానని వాపోయారు.‘ కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడాను. దీంతోపాటుగా ఇండియన్ పీస్ కీసింగ్ ఫోర్స్‌లో భాగంగా శ్రీలంకలోనూ పని చేశాను.

ఇలా దేశం కోసం పోరాడిన నేను నా భార్యను, కుటుంబాన్ని, గ్రామస్థులను మాత్రం కాపాడుకోలేకపోయాను.ఈ విషయం నన్నెంతో బాధకు గురి చేస్తోంది. కుంగుపాటుకు గురి చేస్తోంది’ అని ఓ వార్తా చానల్‌తో మాట్లాడుతూ ఆ మాజీ సైనికుడు వాపోయారు. మే 4న తమ గ్రామంపై దాడి చేసిన ఆ మూక అనేక ఇళ్లకు నిప్పుపెట్టింది,పలువురిని హతమార్చింది. ఇద్దరు మహిళలను ప్రజలముందే వివస్త్రలను చేసి నగ్నంగా ఊరేగించింది. పోలీసులు అక్కడే ఉన్నా ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఇంతటి దారుణానికి పాల్పడిన ఆ దుండగులకు కఠిన శిక్ష విధించాలని ఆ కార్గిల్ వీరుడు డిమాండ్ చేశారు. ఇండియన్ ఆర్మీలో పని చేసిన ఆయన అస్సాం రెజిమెంటులో సుబేదార్‌గా సేవలందించినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News