Saturday, May 4, 2024

మాజీ సిఎస్ సోమేశ్ భూముల కొనుగోళ్లలో క్విడ్ ప్రోకో!

- Advertisement -
- Advertisement -

నలుగురి దగ్గరి నుంచి ఎకరానికి రూ.2 లక్షల చొప్పున కొనుగోలు
ఫార్మాసిటీ వస్తుందని ముందే తెలుసుకొని కొన్నారా?

మనతెలంగాణ/హైదరాబాద్:  మాజీ సిఎస్ సోమేశ్‌ కుమార్ ఆస్తుల చిట్టాలో తాజాగా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. పక్కా ప్లాన్ ప్రకారమే ఆయన యాచారంలో భూములు కొన్నట్టు తేలింది. ఆ ప్రాంతంలో ఫార్మాసిటీ వస్తుందని ముందే తెలుసుకుని, 25 ఎకరాల భూములను అత్యంత తక్కువ రేటుకు తన భార్య డాగ్యన్ముద్ర పేరిట కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. ఎకరాకు రూ.3 కోట్లకు పైగా ఉన్న ఆ ప్రాంతంలో కేవలం రూ.2 లక్షలకే ఆయన కొన్నారు. అయితే ధరణి పోర్టల్ వచ్చాక కొనుగోలు చేశారా? లేక అంతకుముందే కొన్నారా? అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ధరణి పోర్టల్‌లో ఈ భూమికి సంబంధించిన ఖాతా నం.5237గా ఉంది. 2018లో ఫార్మాసిటీ ప్రాంతం కొత్తపల్లిలో సోమేశ్ కుమార్ 25 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఎకరాకు కేవలం రూ.2 లక్షలు మాత్రమే చెల్లించి, నలుగురి దగ్గర నుంచి ఆ భూముల్ని ఆయన కొనుగోలు చేయడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. భూముల కొనుగోలులో క్విడ్ ప్రోకో జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు భూ రికార్డుల ప్రక్షాళనకు ముందు ఆ స్థాయిలో భూ ఖాతాదారులు లేరు. మరీ ధరణి పోర్టల్లో ఈ ఖాతా నెంబర్ ఏ విధంగా కేటాయించారన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ వెబ్‌సైట్‌లో ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్‌ను పరిశీలిస్తే అందులో ఈ భూమి కొనుగోలు చేసిన ఆధారాలు కనిపించచక పోవడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News