- Advertisement -
లఖ్నో: గ్యాంగ్రేప్ కేసులో నిందితుడు మాజీమంత్రి గాయత్రి ప్రజాపతికి బెయిల్ దొరికింది. అలహాబాద్ హైకోర్టు లఖ్నో బెంచ్ శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. 41నెలలపాటు లఖ్నో జైలులో విచారణ ఖైదీగా ఉన్న ప్రజాపతికి రెండు నెలలపాటు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ వేద్ప్రకాశ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దేశం విడిచి వెళ్లొద్దని, విచారణకు సహకరించాలని షరతులు విధించారు. మథుమేహంసహా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తనకు బెయిల్ ఇవ్వాలని ప్రజాపతి అభ్యర్థించగా ఈ ఉత్తర్వులిచ్చారు. సమాజ్వాదీ పార్టీకి చెందిన ప్రజాపతి తాను యుపిలో మంత్రిగా ఉన్న సమయంలో చిత్రకూట్కు చెందిన ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడని,ఆమె కూతురిపైనా అత్యాచారానికి యత్నించాడని ఆరోపణలున్నాయి.
Ex minister Prajapati gets bail in gang rape case
- Advertisement -