Saturday, May 4, 2024

మాది హైదరాబాదే కానీ తెలుగు రాదు!

- Advertisement -
- Advertisement -

నవీన్ పొలిశెట్టి హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘జాతిరత్నాలు’. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్ పతాకంపై అనుదీప్ దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మించారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ “మా స్వస్థలం హైదరాబాద్. కానీ తెలుగు మాట్లాడడం రాదు. సినిమాల్లోకి రావడంతో ఇప్పుడు తెలుగు నేర్చుకుంటున్నా. మోడల్‌గా రాణించి హీరోయిన్‌గా సినీ రంగ ప్రవేశం చేశాను. నిర్మాత నాగ్‌అశ్విన్ నాకు ఈ సినిమాలో నటించే అవకాశాన్నిచ్చారు. నేటి సమాజ ధోరణిని ప్రతిబింబించే చిత్రం ‘జాతిరత్నాలు’. ఈ చిత్రంలో చిట్టి పాత్రలో నటించాను. అమాయకత్వంతో కూడిన ఈ పాత్రలో ఒదిగిపోయేందుకు ముందుగా రిహార్సల్స్ కూడా చేశాను. హీరో నవీన్ మంచి కోస్టార్. తొలి సినిమానే పెద్ద నిర్మాణ సంస్థతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది” అని అన్నారు.

Faria abdullah tells how to get chance in Jathi Ratnalu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News