- Advertisement -
మన తెలంగాణ/భిక్కనూర్ : కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండల తిప్పాపూర్ గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ పొలం వద్ద సోమవారం వరికోతకు వెళ్లిన రైతులు కొండచిలువను కొట్టిచంపేశారు. రైతు పొలం పనులకు వెళ్తుండగా కొండచిలువ కనిపించడంతో భయంతో అరిచాడు. వెంటనే చుట్టుపక్కల ఉన్న రైతులు అక్కడికి చేరుకొని సుమారు మూడున్నర మీటర్ల పొడవు ఉన్న కొండచిలువను కర్రలతో కొట్టి చంపేశారు.
- Advertisement -