Saturday, April 27, 2024

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Fatal road accident in Kullu

హిమాచల్‌ప్రదేశ్‌: కులులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటకులతో వెళుతున్న టెంపో ట్రావెలర్‌ కులో సమీపంలోని ఘియాగి వద్ద అదుపుతప్పి లోయలో పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు మరణించారు. మరో పది మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు స్థానికులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కులు లోని ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లకు చెందిన వారని అధికారులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News