Saturday, May 4, 2024

ఎపిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రీకొడుకుల మృతి

- Advertisement -
- Advertisement -

Father and Son died in Road Accident in Kadapa

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడప జిల్లాలోని మైదుకూరు రహదారిపై బైకు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసి బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వల్లూరు మండలం చిన్ననాగిరెడ్డిపల్లికి చెందిన రామిరెడ్డి తన భార్య, ఇద్దరు కుమారులతో కలిసి బైక్‌పై వెళ్తున్న సమయంలో లారీని ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రామిరెడ్డి, అతని కుమారుడు ఘటనాస్థలంలోనే మరణించారు. అతని భార్య, మరో కుమారుడు కూడా గాయపడ్డారు. వారిని వెంటనే కడప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Father and Son died in Road Accident in Kadapa

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News