Wednesday, May 1, 2024

నడిరోడ్డుపై కన్న కూతురు ముందే తండ్రి హత్య… మొండెం నుంచి తలను వేరు చేసి…

- Advertisement -
- Advertisement -

 

చెన్నై: నడిరోడ్డుపై కన్న కూతురు ముందే తండ్రిని కత్తులతో నరికి, మొండెం నుంచి తలను వేరు చేసిన సంఘటన తమిళనాడులోని శ్రీరంగం పట్నంలో జరిగింది. ఈ హత్య చేసిన నిందితులు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. డ్రైనేజీ వీధిలో చంద్ర మోహన్ అలియాస్ తలైవెట్టి చంద్రు నివసిస్తున్నాడు. చంద్ర మోహన్‌పై స్థానిక పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసులు ఉన్నాయి.  శ్రవణన్, సురేష్ అనే ఇద్దరు అన్నదమ్ములతో చంద్రమోహన్‌కు వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్నారు. గత కొన్ని రోజులుగా వ్యాపారంలో చంద్ర మోహన్‌కు తన భాగస్వాములతో గొడవలు జరుగుతున్నాయి. తన రెండేళ్ల కూతురితో కలిసి చంద్రమోహన్ దేవీ థీయోటర్ సమీపంలో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా శ్రవణన్, సురేష్, సెల్వం అనే ముగ్గురు దుండగులు కాపు కాసి కత్తులతో అతడిపై దాడి చేశారు. నడి రోడ్డుపై కన్న కూతురు ముందే మొండెం నుంచి తలను దుండగులు వేరు చేశారు. అనంతరం స్థానికుల పోలీస్ స్టేషన్‌లో దుండగులు లొంగిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏప్రిల్ 24న చంద్రు జైలు నుంచి బెయిల్‌పై విడుదలైనట్టు పోలీస్ కమిషనర్ వరధరాజు తెలిపాడు. తండ్రిని కిరాతకంగా చంపుతునప్పుడు షాక్‌కు గురైన కూతురును స్థానిక ఆస్పత్రికి పోలీసులు తరలించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Father head chopped off in front of his daughter,three killers took the chopped head to the police station and surrendered
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News