Friday, May 3, 2024

బాధిత కుటుంబాలకు ఎఫ్‌డిసి చైర్మన్ పరామర్శ

- Advertisement -
- Advertisement -

గజ్వేల్: గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఫీల్డ్ ఆసిస్టెంట్ ప ంది బలరాం రెండు రోజుల క్రితం హఠాన్మరణం చెందగా అదే గ్రామానికి చెందిన పంజాల ఎల్లాగౌ డ్ ఆనారోగ్యంతో మృతిచెందాడు. సన్నిహితుల ద్వారా విషయం తెలుసుకున్న ఎఫ్‌డిసి చైర్మన్ వం టేరు ప్రతాప్‌రెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించి వారిలో మనోధైర్యం నింపారు. ఫీల్డ్ అసిస్టెంట్‌గా విదులు నిర్వహిస్తున్న గ్రామంలో మంచిపేరు తెచ్చుకున్న బలరాం కుటుంబాన్ని ప్రభుత్వం తరుపున అన్ని విధాల ఆదుకుంటామని భరోసాగా చె ప్పారు. పరామర్శించిన వారిలో గ్రామ సర్పంచ్ పా శం బాపిరెడ్డి, బిఆర్‌ఎస్ యూత్ వింగ్ మహమ్మద్ సాజిద్, బిఆర్‌ఎస్ గ్రామ కార్యదర్శి పంజాల రవీందర్‌గౌడ్, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.

వర్గల్‌లో… వర్గల్ మండలం మాచారం గ్రామానికి చెందిన గ్రామ బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు అంకని పోచయ్య తల్లి అంకణి పాపమ్మ,నిరుడు ఎల్లమ్మ, గతకొన్ని రోజులుగా ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఇటీవలే వారం రోజుల క్రితం మరణించా రు. అదే విధంగా మజీద్ పల్లి గ్రామ బిఆర్‌ఎస్ పా ర్టీ అధ్యక్షుడు గుంటుకుమహేశ్ తండ్రి గుంటుకు స త్తయ్య సైకిల్‌పై వెలుతుండగా డిసిఎం ఢీ కొనడం తో ఒక నెల రోజుల వరకు హాస్పిటల్‌లో చికిత్స పొ ందుతూ ఇటీవలే మృతి చెందాడు. అలాగే మజీద్ పల్లి గ్రామానికి చెందిన పంపరి రాధిక ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు. అదే విధంగా అనంతగిరిపల్లిలో ఆనారోగ్యం కారణంగా మృతి చెందిన బిఆర్‌ఎస్ కార్యకర్త దార సాయిలుల కుటుంబాల ను ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పరామర్శి ంచి వారి కుటుంబాలను ఓదార్చి ఆర్థిక సాయం అందజేశారు. ఎంపిపి లతా రమేశ్, యూత్ ప్రెసిడె ంట్ లింగనాగరాజు, సర్పంచ్ లతా శివరాములు, మహేశ్, లక్ష్మణ్, నర్సింలు, సత్యం, లింగం, గణేశ్, శ్రీను, దశరథం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News