Wednesday, May 1, 2024

ఆర్థిక సాయం అందజేత

- Advertisement -
- Advertisement -

బాసర : రాజీవ్ గాంధీ శాస్త్ర సాంకేతిక విశ్వవిద్యాలయం బాసర ట్రిపుల్ ఐటీలో సెక్యూరిటి గార్డ్ నానం సాయిలు ఇటీవల విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మృతి చెందారు. మానవత్వం చాటుకున్న సెక్యూరిటి సిబ్బంది, మంగళవారం ట్రిపుల్ ఐటీ వీసీ వెంకటరమణ చేతుల మీదుగా ఒకరోజు వేతనం వారి కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా సెక్యూరిటి సిబ్బంది మాట్లాడుతూ ట్రిపుల్ ఐటీలో పనిచేసే 153 మంది సెక్యూరిటి సిబ్బంది ఎవరికి ఏ ఆపద వస్తే ఆ కుటుంబానికి సహాయ సహకారాలు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా సెక్యూరిటి సిబ్బందిని వీసి అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News