హైదరాబాద్: చేపల వ్యాపారి హత్యకు గురైన సంఘటన నగరంలోని జూబ్లీహిల్స్లోని కళ్యాణ్ నగర్లో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని ఎస్ఆర్ నగర్, బోరబండకు చెందిన రమేష్(55) చేపల వ్యాపారం చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు రమేష్ను కిడ్నాప్ చేశారు. కళ్యాణ్ నగర్కు చెందిన వారు ఓ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు ఇంటి లోపలికి వెళ్లి చూడగా ఓ వ్యక్తిని హత్య చేసి గోనె సంచిలో పెట్టి ఉంచారు. సంఘటన స్థలంలో ఉన్న ఆధారాలను పరిశీలించగా ఎస్ఆర్ నగర్కు చెందిన చేపల వ్యాపారి రమేష్గా గుర్తించారు. పోలీసులు విచారణ చేయగా రమేష్ రెండు రోజుల క్రితం కిడ్నాప్కు గురైనట్లు తెలిసింది. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయినట్లు తెలిసింది. పోలీసులు వివరాలు తెలుసుకోగా కిడ్నాప్ చేసిన తర్వాత రమేష్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రూ.90 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారని, దీంతో రమేష్ కుటుంబ సభ్యులు వెంటనే ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల వెంటనే విచారణ ప్రారంభించలేదని, పోలీసుల నిర్లక్ష్యం వల్లే రమేష్ హత్యకు గురయ్యారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.
Fisherman Murder by Kidnapper in Jubilee Hills